ప్రొ. శేషయ్య మొదటి సంస్మరణ సభ | ఆంధ్రప్రదేశ్

గుంటూరు లోని సి.పి.ఏం ఆఫీస్ లోని కొరటాల సత్య నారాయణ మీటింగ్ హాల్లో 17/10/2021 ,ఆదివారం నాడు పౌర హక్కుల సంఘం ,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు చిట్టీ బాబు అధ్యక్షతన జరగిన పౌర హక్కుల ఉద్యమ ధృవతార ,అమరుడు ప్రొఫెసర్ ఎస్.శేషయ్య గారి మొదటి సంస్మరణ సభలో రాష్ట్ర కార్య దర్శి చిలుకా చంద్ర శేఖర్ గారు
 మాట్లాడుతూ పౌర హక్కుల కోసం తనజీవితాంతం పోరాడిన శేషయ్య అపర మేధావి,ఆయనలో దాగి ఉన్న జ్ఞాన ఘనిని భావితరాలకు అందించే క్రమంలో ఆయన రాసిన అనేక రచనలను పుస్తకాల రూపంలో తీసుక వస్తున్నామని,ఆయన ఆలోచనలను,ఆశయాలను కొనసాగించినపుడే ఆయనకు నివాళులు అర్పించిన వారం అవుతాయన్నారు.

    శేషయ్య గారి సహచరి " పౌర హక్కుల ఉద్యమ ధృవ తార....శేషయ్య జ్ఞాపకాలు" అనే పుస్తకాన్ని ఆవిష్కరించి, శేషయ్య గారి గురించి ఆమె మాట్లాడుతూ కర్నూల్ జిల్లా నందికొట్కూరు అనే మారుమూల గ్రామంలో పేద కుటుంబం లో జన్మించి తొమ్మిదేళ్ళ వయస్సులోనే కుటుంబానికి చేదోడుగా వ్యవసాయ కూలీగా,పెయింటర్ గా ఇంటింటికీ పాలు పోస్తూ చదువుకొని ఉన్నతమైన న్య్యాయ శాస్త్ర విద్య చదువుకొని అనంతపురం యూనివర్శిటీ లో ఆచార్యులుగా కొనసాగారు...తన విద్యార్థి దశలోనే RSU రాజకీయాల కు ఆకర్షితులై ,తను పిన్న వయసులోనే ,పేదరికం అనుభవించడం వలన ప్రజల తరపున తన శక్తి కి మించి పనిచేశాడు...పీడిత ప్రజల హక్కుల కోసం దాదాపు నాల్గు దశాబ్దాలుగా పోరాడారని కొనియాడారు...సంస్థ సంక్షోభ సమయంలో ఆయన బాధ్యతలు తీసుకున్న ప్పటి నుండి ఎన్ని నిర్బాందాలు ఉన్నా,బెదిరింపులు వచ్చినను ఏ నాడూ ఆయన భయపడలేదు స్వయంగా ఇంటీ మీద దాడులు జరిగినను చివరివరకు పీడిత ప్రజల వైపే ఉన్నాడని పేర్కొన్నారు...పౌర హక్కుల సంఘం లోని ప్రతి నాయకుడు,కార్యకర్త లను తన కుటుంబ సభ్యులు గానే భావించారు,రాష్ట్రంలో ఎక్కడ హక్కుల ఉల్లంఘనలు జరిగిననూ వెంటనే స్పందించే వారని ,క్రమంగా దేశంలో ఉన్న అన్ని హక్కుల సంఘాలను ఒకే వేదిక పైకి తెచ్చి CDRO సంస్థ కు కన్వీనర్ గా ఎన్నిక్యారు...తన చివరి శ్వాస వరకు భారత దేశ పీడిత ప్రజల హక్కుల కోసం నిరంతరం పనిచేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడుతూ,ఆయన ఆశయాలను కొన సాగించి నపుడే నివాళులు అర్పించిన వారం అవుతామన్నారు...
 
   ముఖ్య అతిధి పంజాబ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ జగ్ మోహన్ సింగ్ గారు మాట్లాడుతూ ప్రొఫెసర్ దేశంలో అన్ని వర్గాల ప్రజలు ఎదుకొంటున్న అనేక సమస్యల పట్ల స్పష్టమైన అవగాహన తో ఉండి కార్మిక,కర్షక,రైతాంగ పోరాటాలకు మద్దతు పలుకుతూ పౌర హక్కుల సంఘాన్ని ఆవిందంగా తీర్చి దిద్దారు అని కొనియాడారు...ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు రైతాంగ వ్యతిరేక బిల్లులతో వ్యవసాయాన్ని కార్పోరీటీకరణ చేసే విధంగా ఉందని, ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న పోరాటాల మీద కేంద్ర ప్రభుత్వం అనేక కుట్రలు చేస్తూ వారిపై అనేక తప్పుడు కేసులు,హత్యా యత్నం కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు..రైతులు చేస్తున్న పోరాటాల కు మద్దతు పలుకు తున్న ప్రజా సంఘాల,జర్నలిస్టుల మీద ఊపా కేసులు పెట్టడం దారుణమని పేర్కొన్నారు.. ఈ రోజు రైతులు వారి కోసమే కాక ఈ దేశ ప్రజల కోసం,వినియోగ దారుల కోసం,భావి తరాల వారికోసం చేస్తున్నారు,మనందరి కోసం చేస్తున్న రైతుల పోరాటాన్ని ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు....
      పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు,CDRO కో.కన్వీనర్ కె.క్రాంతి చైతన్య గారు ప్రొఫెసర్ శేషయ్య గారు భారత న్యాయ వ్యవస్థ పై రచించిన,రాసిన వ్యాసాలను సంకలనాలు వచ్చిన"రాజ్యాంగం...పౌర హక్కులు" అనే పుస్తకాన్ని ఆవిష్కరించి, ప్రసంగించారు...ఆయన మాట్లాడుతూ హక్కులనేవి భిక్ష కాదని ప్రజలు పోరాడి సాడించినవని బలంగా నమ్మి ,ప్రచారం చేశారని పేర్కొన్నారు...భారత న్యాయ వ్యవస్థ కు బహు ముఖాలున్నయని,కోర్టులు ప్రజల కొరకు లేవని ,ప్రజల కొరకు ఉన్నట్లు కోర్టులు నటిస్తాయని , పీడిత ప్రజలకు అనుకూలమైన తీర్పులు ఇవ్వవని శేషయ్య విశ్లేషించారు అని ఆయన పేర్కొన్నారు..

   ఆంధ్ర ప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్ రమేష్ పట్నాయక్ గారు మాట్లాడుతూ జాతీయ విద్యావిధానం సారాంశంలో కెంద్ర విద్యావిధానం అన్నారు ,విద్యారంగం లో ప్రవేట్ పెట్టుబడికి సకల సౌకర్యాలు సమకూర్చడానికి చట్టం ద్వారా ఏర్పాటు చేయడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం,రాష్ట్రాల ప్రమేయం లేకుండా కేంద్ర ప్రభుత్వం ద్వారానే విద్యా విధానాన్ని ఫాసిస్ట్ విధానానికి అనుగుణంగా మనువాద న్ని,చొప్పించడం, అన్ని రకాల రిజర్వేషన్స్కు స్వస్తి చెప్పడం దీన్ని ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.సీనియార్టి,మెరిట్లను అరేసేస్ భా వ జాలనికి ఉపకరించే విధంగా మార్చడమే ఈ నూతన విద్యావిధానం అని పేర్కొన్నారు.కేంద్రీకరణ,మార్కెట్ సౌలభ్యం,అక్రమ చోరబాటు,ప్రామాణీకరణ అనే పని ముట్ల ద్వారా ఫాసిజాన్ని పాదు కొనేటట్లు చేయడమే బి.జే.పి ఉద్దేశమన్నారు. ఫెడరలిజానికి సమూహ అంతర వైవిధ్యానికి, కాలాల మధ్య మార్పుకు, సంస్కృతిలో పరిణామాన్ని వ్యతిరే కించేదే కొత్త విద్యావిధానం.ప్రగతి శీల శక్తులు ఈ నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు.

    భోజనం తదనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షులు నంబూరి శ్రీమన్నారాయణ,రాష్ట్ర సహాయ కార్య దర్షులు ఎల్లంకి వెంకటేశ్వర్లు(నెల్లూరు),సి.వెంకటేశ్వర్లు (కడప) అధ్యక్షతన ప్రజాసంఘాల ప్రతినిధులు సి.ఎస్.ఆర్.ప్రసాద్(విరసం),నారాయణరావు( పౌర హక్కుల సంఘం తెలంగాణ),దుడ్డు ప్రభాకర్(KNPS),B.కొండారెడ్డి(PKS),హనుమంతరావు(OPDR),CHLN మూర్తి(ILU),Y.వెంకటేశ్వరరావు(PDM),లక్ష్మా రెడ్డి(DTF),నాగేశ్వర్ (PKM) తదితరులు పాల్గొని శేషయ్య సమాజంలోని అణచివేతకు గురి కాబడుతున్న దళితుల,ఆదివాసీల,మహిళల,ముస్లిం మైనారిటీల హక్కుల కొరకు నిరంతరం పనిచేశారు అని కొనియాడారు,ఈ సభకు పెద్ద ఎత్తున పౌర హక్కుల సంఘం కార్యకర్తలు ,ప్రజాస్వామిక వాదులు పాల్గొని జయప్రదం చేశారు.

      వి. చిట్టి బాబు,రాష్ట్ర అధ్యక్షులు,
చిలుకా చంద్ర శేఖర్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.
పౌర హక్కుల సంఘం,
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ.
గుంటూరు..17/10/2021.

Comments