పృథి రాజ్, సంపత్ లను విడుదల చేయాలి | సి ఎల్ సి, టి ఎస్



తెలంగాణ పోలీసుల అదుపులోనున్న న్యాయవాది పృథి రాజ్, సంపత్ లను విడుదల చేయాలి...పౌర హక్కుల సంఘం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు కు చెందిన అడ్వకేట్,అంకాల పృథ్వీరాజ్ మరియు అంబేద్కర్ పూలే సంఘం, హైదరాబాద్ కు చెందిన సంపత్ అనే కార్యకర్తను తెలంగాణ రాష్ట్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల వద్ద పోలీసులు నిన్న 29,ఆగస్ట్ 2021 ఆదివారం మద్యహ్నం అదుపులోకి తీసుకున్నారని, సాయంత్రం 6 గంటల సమయంలో ప్రెస్ మీట్ ద్వారా ప్రకటిస్తామని చెప్పినారని స్థానిక న్యాయవాదులు పౌర హక్కుల సంఘానికి తెలిపినారు.

ఈ రోజు సోమవారం,30 ఆగస్ట్ 2021 రాత్రి 9:30గంటలవరకు కూడా పోలీసులు వారిద్దరిని తమ అదుపులోఉన్నట్లుగా ప్రకటించలేదు మరియు మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచ లేదు...
ప్రజాస్వామిక వ్యవస్థలో పోలీసులే కిడ్నాప్ చేసినట్లుగా ప్రజలు భావిస్తున్నారు.ఇది ముఖ్యమంత్రి KCR అప్రజాస్వామిక పాలనకు మరియు రాజ్యాంగ వ్యతికరేక వైఖరికి నిదర్శనం ఈ పోలీస్ కిడ్నాప్ లు.ఇప్పటికైన వారిద్దరిని విడుదల చేయాలని లేదా మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది....

1.N. నారాయణ రావు, ప్రధాన కార్యదర్శి,పౌర హక్కుల సంఘం తెలంగాణ..
2.చిలుకా చంద్రశేఖర్,ప్రధాన కార్యదర్శి,పౌర హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్...
30,ఆగస్ట్,2021,సోమవారం,రాత్రి.10:00..

Comments