రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 30 మంది నివాసాలపై ఏకకాలంలో దాడి చేసి ఇదే పద్ధతిని అనుసరించారు.
హైదరాబాదులో రఘునాధ్–పౌరహక్కుల సంఘం, జాన్–ప్రజా కళామండలి, దేవేంద్ర–చైతన్య మహిళా సంఘం, శిల్ప–చైతన్య మహిళా సంఘం, డప్పు రమేష్ –ప్రజా గాయకుడు, స్వప్న–చైతన్య మహిళా సంఘం, దేవేందర్–దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం; ప్రొద్దుటూరులో వరలక్ష్మి–విరసం, కర్నూలులో పాణి–విరసం, ప్రకాశం జిల్లా గణపవరంలో అంజమ్మ–-అమరుల బంధుమిత్రుల సంఘం, ప్రకాశం జిల్లా ఆలకూరపాడులో–శిరీష, గుంటూరు జిల్లా తాడేపల్లిలో–రాజేశ్వరి, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో–చిట్టిబాబు, గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో చిలుకా చంద్రశేఖర్– పౌరహక్కుల సంఘం, వైజాగ్లో పద్మ–రాజకీయ ఖైదీల విడుదల కమిటీ, వైజాగ్లో కెఎస్ చలం–అడ్వకేట్, విఎస్ కృష్ణ–మానవ హక్కుల వేదిక, శ్రీకాకుళం జిల్లా రాజమండ్రిలో నీలకంఠం–ప్రజాకళామండలి, గూడూరు గ్రామంలో జోగి కోదండం అమరుల బంధుమిత్రుల సంఘం, పల్లిసారధి గ్రామంలో పి.సుమ–చైతన్య మహిళా సంఘం, హైదరాబాదులోని కోఠిలో ఉన్న ఇల్లు, వైజాగులో బాలకృష్ణ– రాజకీయ ఖైదీల విడుదల కమిటీ, శ్రీరామమూర్తి– పౌరహక్కుల సంఘం, నర్సరావుపేటలో వై.కోటేశ్వరరావు దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం, వైజాగ్లో అన్నపూర్ణ ప్రగతిశీల కార్మిక సంఘం, మంగళగిరిలో బి.కొండారెడ్డి–ప్రగతిశీల కార్మిక సంఘం, విజయవాడలో దుడ్డు ప్రభాకర్, గుంటూరు న్యాయవిద్యార్థి క్రాంతి, తెనాలిలో కృష్ణ-–కుల నిర్మూలన పోరాట సమితి మొదలైన వారి ఇళ్ళపై దాడి చేసి, ఏడు, ఎనిమిది గంటల పాటు ఏకధాటిగా సోదాలు నిర్వహించారు. పుస్తకాలు, సాహిత్యం, పెన్డ్రైవ్లు, ల్యాప్టాప్లు, హార్డ్డిస్క్లు, డబ్బులు తీసుకెళ్ళారు. ఈ సోదాలో 70 హార్డ్ డిస్క్లు, 19 పెన్డ్రైవ్లు, 40 సెల్ఫోన్లు, 44 సిమ్కార్డులు, 184 డివిడిలు, ఒక ల్యాప్టాప్, ఆడియోరికార్డర్, ఆయుధాలు, మావోయిస్టు సాహిత్యం, జెండాలు, ప్రెస్ నోట్లు, 10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లుగా ఎన్ఐఎ ప్రకటించింది.
ప్రజాస్వామ్య వ్యతిరేకమైన ఊ పా చట్టాన్నిరద్దు చేయాలని డిమాండ్ చేసిన ప్రజా సంఘాల నాయకులు
____________________________
ఉపా ను రద్దు చేయాలి
Comments
Post a Comment