ప్రగతి శీల సమాఖ్య నాయకురాలు అన్నపూర్ణ అక్రమ అరెస్ట్ ను పౌర హక్కుల సంఘం తెలంగాణ ఖండిస్తుంది.
చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం (UAPA) పేరుతో ఆంధ్రప్రదేశ్ లో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. రాత్రి గడిస్తే చాలు ఎవరిని ఉపా కింద అరెస్టు చేస్తారోనని ప్రజా సంఘాల నాయకులు భయ బ్రాంతులకు
గురౌతున్నారు. ప్రజా సంఘాల నాయకులను లక్ష్యంగా చేసుకుని, ప్రత్యేకంగా, ఉపా చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.
వ్యక్తులు మరియు ప్రజా సంస్థలను లక్ష్యంగా చేసుకుని, పోలీసుల అరెస్టులు జరుగుతున్నాయు. వీటిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చే న్యాయ విచారణ జరిపించాలి.
ప్రజా సంఘాల కార్యకర్తలు కోపంతో భయంతో నిరంతరాయంగా వేధింపులు, విచారణలు ఎదుర్కొంటున్నారు.
శాంతియుత మరియు ప్రజాస్వామ్య బద్దంగా ఉపా వ్యతిరేక నిరసనలను జరుగుతున్నాయు. ఈ నేపథ్యంలో పీకే ఎస్ సంఘ నాయకులు మావోయిస్టుల సూచనల మేరకు పని చేస్తున్నారని, వారి వెనుక ఉన్న శక్తులను గుర్తించడానికి అవసరమైన చర్యగా పోలీసులు ఈ అరెస్టులను సమర్దిస్తున్నారు. నిజమైన అంశాలపై పోలీసుల దర్యాప్తు స్వాగతించబడుతున్నప్పటికీ, ఈ తరహా అక్రమ అరెస్టులు పోలీసుల పాత్ర పై ఆందోళనలను, అనుమానాలను పెంచుతోంది. ఈ అరెస్టులకు కొన్ని రోజుల ముందు అమిత్ షా జాతీయ భద్రతా మండలి సమావేశం నిర్వహించడం యాదృచ్చికం కాదు. అందులో భాగంగా
ప్రజాసంఘాల కార్యకర్తలపై దర్యాప్తు చేయాలనే ఉద్దేశ్యంతో పోలీసులు, వారిపై నిజమైన అణచివేతను ప్రారంభించారు. మొదటగా చైతన్య మహిళా సమాఖ్య ,అమరుల బందు మిత్రుల సంఘం లను, తర్వాత ప్రగతి శీల సమాఖ్యను
ప్రత్యేక లక్ష్యంగా చేసుకున్నారు. ప్రజా సంఘాల కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేస్తూ రాజ్యాంగ విరుద్ధంగా మెదులుతున్నారు.
ప్రస్తుత బిజెపి, వై సి పి ప్రభుత్వంలో రాజకీయ అసమ్మతిని అరికట్టడానికి ఉపా దర్యాప్తు తప్పుగా ఉపయోగించబడుతుందని ప్రజలు నమ్మడానికి ఈ అరెస్టులు కారణాలుగా ఉన్నాయి. బహుశా ఉపా వ్యతిరేక ఉద్యమం కేంద్ర & ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాలకు కోపం తెప్పించింది. ఈ ఉద్యమానికి అన్ని ప్రజా సంఘాల నాయకుల నాయకత్వం వహించారు. ఈ ఉద్యమం విద్యార్థులు, మహిళల సమూహాలు, కార్మికవర్గాల నుండి అపూర్వమైన మద్దతును పొందింది. ఇది ప్రజాస్వామ్య ప్రయాణంలో ఒక మైలురాయి. ఈ ఉద్యమం ప్రభుత్వం యొక్క రెండు ముఖ్యమైన వాదనలను సవాలు చేసింది. మొదట, ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న వామపక్ష-లిబరల్ ఉన్నతవర్గాలు (తరచుగా ట్విట్టర్ యుద్ధాలలో "లిబ్టార్డ్స్" అని పిలుస్తారు). రెండవది, హిందూ దేవాలయం నిర్మించడానికి బాబ్రీ మసీదు ప్రాంగణాన్ని కేటాయించడం ద్వారా బిజెపి ప్రభుత్వం ముస్లింలపై నిరంతరాయంగా దాడి చేసినప్పటికీ, అల్లర్లు మరియు హింసను నిశ్శబ్దంగా ఆమోదించడం. ఇస్లామోఫోబియాను అనాలోచితంగా ప్రోత్సహించడం. ఆర్టికల్ 370 ను ఏకపక్షంగా ఉపసంహరించుకోవడం వంటివి బిజెపి చేసింది. వీటిని వ్యతిరేకిస్తున్న వారందరినీ ఉగ్రవాదులుగా ప్రభుత్వం పరిగణించింది. వారందరినీ ఉపా చట్టం కింద అరెస్టు చేయటం ప్రారంభించింది.
ఈ అరెస్టులు అప్రకటిత ఎమర్జెన్సీ ధోరణి యొక్క కొనసాగింపుగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లో ఐదు మందిని ఉపా చట్టం కింద అక్రమంగా అరెస్టు చేశారు. తాజాగా అన్నపూర్ణ ను ఈరోజు వైజాగ్ లో అదుపులోకి తీసుకున్నారు. వీరందరూ కూడా మావోయిస్టు సంఘానికి మద్దతుదారులుగా ఉన్నారని తప్పుడు కేసులు పోలీసులు బనాయించారు. నిజానికి వీరు ఉపా వ్యతిరేక ఆందోళనలో ఉధృతంగా పాల్గొన్నవారే. అంతే కాకుండా బిజెపి కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య, హిందూ మతోన్మాద వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వీరు పోరాడారు. తెలుగు రాష్ట్రాలలో మావోయిస్టులే లేరని సాక్షాత్తు కేంద్ర హోం మంత్రి ప్రకటించారు. అటువంటప్పుడు అరెస్టు కాబడిన వారు మావోయిస్టులతో ఎలా సంబంధాలు కలిగి ఉంటారో పోలీసులు చెప్పాలి. ఈ తప్పుడు ఉపా కేసులు న్యాయస్థానాల్లో నిలబడవు. వీరందరూ నిర్దోషులుగా బయటకు వస్తారు. అయితే ప్రజాసంఘాల నాయకత్వాన్ని జైల్లో నిర్బంధించడం వల్ల ప్రజాసంఘాలు నిర్వీర్యం అవుతాయి. ప్రజా సంఘాలు పనిచేయటం ఆపేస్తాయు. తద్వారా ప్రభుత్వాలు ప్రజలపై అప్రజాస్వామిక విధానాలను రుద్దుతుంది. ప్రజలపై పెద్దఎత్తున పన్నుల భారాన్ని మోపి వారిని ఆత్మహత్యల వైపు ప్రభుత్వం నెట్టుతుంది. దీన్ని అన్ని ప్రజా సంఘాలు, వామపక్ష రాజకీయ పార్టీలు ఐక్యంగా తిప్పికొట్టాలి. లేనిపక్షంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరంకుశత్వాన్ని ప్రభుత్వాలు చూపిస్తాయి. భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రశ్నించే హక్కు దెబ్బతింటుంది. ప్రభుత్వాలు రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు పాలు పడతాయి. ఐక్య కార్యాచరణే
లక్ష్యంగా అన్ని ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు ఈ అక్రమ అరెస్టులపై తక్షణమే స్పందించాలి. తద్వారా ప్రభుత్వం చేస్తున్న అక్రమ అరెస్టులను నిరోదించాలి.
1.ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, అధ్యక్షుడు,పౌర హక్కుల సంఘం తెలంగాణ .
2.N. నారాయణరావు, ప్రధాన కార్యదర్శి,పౌర హక్కుల సంఘం తెలంగాణ .
1:00 PM,15 డిసెంబర్,2020.
హైదరాబాద్.
Comments
Post a Comment