సాయిబాబా దీక్షకు మద్దతుగా సభ (కృష్ణా జిల్లా)

21-10-2020 నుండి నాగపూర్ సెంట్రల్ జైలులో సాయిబాబా చేస్తున్న ఆమరణ నిరాహారదీక్షకు మద్దతుగా దేశవ్యాప్తంగా ప్రజాస్వామిక వాదులు వివిధ రూపాలలో చేస్తున్న ఆందోళన లో భాగంగా UAPAరద్దు పోరాటకమిటి ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.

ఆంజనేయులు(CLC) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పోలారి(iftu) అరసవిల్లి కృష్ణ (విరసం) దుడ్డు ప్రభాకర్ (కులనిర్మూలనాపోరాటసమితి) కొండారెడ్డి (ప్రగతిశీల కార్మిక సమాఖ్య) వెంకటేశ్వర్లు(PDM) రామక్రిష్ణ (PDSU)పద్మ(POW) రాజ్యలక్ష్మి (opdr)రాధ(cms) రవిచంద్ర (PDSU)మావోసియాంగ్.తదితరులు పాల్గొని ప్రసంగించారు.

1 జైలు మ్యానువల్ ప్రకారం సాయిబాబాకు అవసరమైన మందులు, తగిన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.
2 రాజకీయ ఖైదీలందర్నీ బేషరతుగా విడుదలచేయాలని ,
3 UAPA నిరద్దుచేయాలని డిమాండ్ చేశారు.

Comments